ఢిల్లీలో కరోనా ఉధృతిని నియంత్రించగలిగినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా కట్టడిలో సహకరించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా కేజ్రీవాల్ దన్యవాదాలు తెలిపారు. తొలుత అంచనా వేసిన దాని ప్రకారం జూలై 15వ తేదీ వరకు ఢిల్లీలో 2.25 లక్షల కేసులు నమోదు కావాలి.
కానీ అందరి సహకారం వల్ల కేసుల సంఖ్య తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో కేవలం 1.15 లక్షల కేసులు మాత్రమే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జూన్ ఒకటవ తేదీన ఢిల్లీలో 4100 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఇవాళ ఆ సంఖ్య 15500కు చేరినట్లు సీఎం తెలిపారు.
విశాఖలో భూములు కాజేసేందుకే వైసీపీ కుట్ర – చినరాజప్ప