గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటన వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ విషయమై స్పందించాలని కోరిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. టీడీపీ నుంచి చంద్రబాబు నన్ను సస్పెండ్ చేయడమేంటి? నేను ముందే పార్టీకి రాజీనామా చేశానన్నారు.
చంద్రబాబునాయుడు ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ మాట్లాడితే మంచిదని సూచించారు. ఆయన తన భవిష్యత్ తను ఫస్ట్ చూసుకోవాలని వ్యాఖ్యానించారు. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో నాకు తెలియదా?. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వచ్చినప్పుడు అందరూ స్వాగతించాల్సిందేనని ఆయన అన్నారు.