కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాట్లాడుతూ… ప్రభుత్వం మరో శతదినోత్సవ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి అభివృద్ది పథకాలను ప్రారంభించనున్నారని. దాదాపు రూ.10 వేలకోట్లతో చేయనున్న అభివృద్ది పథకాలు మొదలు కావడం లేదా పూర్తవడం ఈ వందరోజులలో జరగాల్సి ఉందని ఆయన అన్నారు. దీనిని ప్రెస్ నోట్ ద్వారా కేరళా సీఎం ఆఫీసు తెలిపింది. ‘రాష్ట్రంలో రానున్న 100రోజులలో అనేక అభివృద్ది పథకాలు ప్రారంభం కావడం లేదా పూర్తి కావడం జరుగుతోంది. ఈ రెండో శతదినోత్సవ ప్రోగ్రామ్లో దాదాపు రూ.10 వేలకోట్లతో అభివృద్ది పథాకాలకు చెక్ పెట్టనున్నాం. రాష్ట్ర ప్రజలకు లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రన్ట్(ఎల్డీఎప్) ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తోంది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో 600వాగ్దానాలు ఇచ్చింది. వాటిలో 570 వాగ్దానాలు నెరవేర్చామ’ని ప్రెస్ నోట్లో తెలిపారు. అయితే రాష్ట్రోల మొదటి వందరోజుల ప్రోగ్రామ్ సెప్టంబరు-డిసెంబరు నెలల మధ్యలో తీసుకువచ్చారు. దీనిని రాష్ట్ర ఆర్థిక శక్తిని పెంచేందుకని ప్లాన్ చేశారని సీఎం ఆఫీస్ వారు తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
next post