telugu navyamedia
సినిమా వార్తలు

అమ్మ మీద ఒట్టు.. కనీసం వక్కపొడి కూడా వేసుకోను..

టాలీవుడ్ లో ప్రకంపనాలు సృష్టింస్తున్న డ్రగ్స్ కేసులో ప‌లువురుకు నోటీసులు జారీ చేయ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా ఈ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని ప్రశ్నిస్తున్న ఈడీ .. ఆయన ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ పైన‌ దృష్టి సారించిన ఈడీ విదేశీ లావాదేవీలపై ఆరా తీశారు.

ఇదిలా ఉంటే .. పూరీతో పాటు బండ్ల గణేష్ కూడా ఈ విచారణ సమయంలో కనిపించడంతో.. ఆయనకు కూడా ఏమైనా డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నాయా? అనేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు..

అయితే ఈ వార్తలపై వెంటనే స్పందించిన బండ్ల గణేష్ ‘‘దయచేసి నన్ను అర్థం చేసుకోండి ..డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు..‘‘అమ్మ మీద ఒట్టు.. కనీసం వక్కపొడి కూడా వేసుకోని నన్ను ఈడీ వాళ్లు ఎందుకు పిలుస్తారు. .పూరీ జగన్నాథ్ ను ఈడీ 8 గంటలపాటు విచారిస్తున్నారు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి నా అంతట నేనే వచ్చా అన్నారు

అంతేకాకుండా ..పూరీ జగన్నాథ్ నాకు మిత్రుడు కాబట్టే నేను కలవడానికి మాత్ర‌మే ఈడీ కార్యాలయంకు వచ్చాను..అయితే, పూరీని కలవడానికి ఈడీ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నాడు.

కాగా.. నిరాత్మ బండ్ల గణేష్, డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో బిజినెస్ మెన్, టెంపర్, ఇద్దరు అమ్మాయిలతో, కెమెరా మెన్ గంగాతో రాంబాబు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts