“పిట్టా కథలు” వెబ్ సిరిస్ను నాగ్ అశ్విన్, బి. వి. నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ మరియు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ నాలుగు లఘు చిత్ర విభాగాలతో కూడిన 2021 భారతీయ తెలుగు భాషా సంకలన నాటక చిత్రం. ఈ చిత్రంలో అమలా పాల్, అశ్విన్ కాకుమాను, ఈషా రెబ్బా, జగపతి బాబు, లక్ష్మి మంచు, ఆషిమా నార్వాల్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే మరియు శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని RSVP మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. అయితే… తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రం 19 ఫిబ్రవరి 2021 న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది.
previous post
తన ఆరోగ్యంపై అమితాబ్ షాకింగ్ కామెంట్స్