telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రేపే జీహెచ్‌ఎంసీ కౌంటింగ్…

ghmc hydeerabad

రేపు జరిగే గ్రేటర్ ఎన్నికల యొక్క కౌంటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేస్తారు. 1 హల్ కి 14 టేబుల్స్ ఉంటాయి.  ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152. అలాగే 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు చేసారు. అయితే 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది. ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. అయితే బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే మొదట మెహిదీపట్నం, చివరగా మైలార్ దేవ్ పల్లి డివిజన్ల ఫలితాలు వెలువడుతాయి. 74 లక్షల 04,288 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 149 డివిజన్లలో 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈరోజు 69 పోలింగ్ కేంద్రాల్లో ఓల్డ్ మలక్ పేట రిపోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ అనంతరం రేపు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

Related posts