*వడ్ల కొనుగోలుపై కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర..
*కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు..
*ఫాంహౌస్లో వరి పండించి..రైతులకు వరి వేస్తే ఉరే అంటాడు..
*కేసీఆర్ తీరు ఇబ్బందుల్లో రాష్ర్ట రైతాంగం
*రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ రాక్షసానందం
వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వడ్లు మాత్రమే కొనాలంటూ కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదని అన్నారు.
ధాన్యం కొనేది లేదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని బండి సంజయ్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కొంటున్నట్లే తెలంగాణలోనూ కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు
కేసీఆర్ మూర్ఖత్వం వల్ల తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభించారు. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోళ్లపై కొత్త ఉద్యమం లేవనెత్తుతున్న కేసీఆర్ విధానాలతో వాళ్లు ధాన్యం అమ్మడానికి మళ్లీ అవస్థలు పడాల్సిన పరిస్థితి..కేసీఆర్కు కేంద్రంతో ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాడాలని.. రైతుల విషయంలో కక్ష పూరితంగా వ్యవహరించకూడదన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చూసిన కేసీఆర్కు దడ పుట్టింది. 105 స్థానాల్లో గెలుస్తామని ధీమాతో ఉన్నారంట.. 95 నుంచి 105 తెరాసవి కాదు బీజేపీ స్థానాలవి. కావాలంటే సర్వే నివేదిక తెప్పించుకుని చూడండి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.”
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రభుత్వాన్ని, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తుంటే… కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు.. ఇమ్రాన్ కు ఉన్న బుద్ధి, కేసీఆర్ కు లేదని ఫైర్ బండి సంజయ్ తెలిపారు.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “ది కాశ్మీర్ ఫైల్స్” కు వ్యతిరేకంగా మాట్లాడే ముఖ్యమంత్రికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు..
పాకిస్థాన్, చైనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయన్నారు.. అయినా, నీకు కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు నచ్చుతాయి.. దోపిడీ దొంగలు లాంటి సినిమాలు నచ్చుతాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారని ఆరోపించిన సంజయ్.. బోధన్లో బీజేపీ కార్యకర్తలు, హిందువులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.