telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీకి ట‌చ్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నిక‌లు వ‌ర‌కు ప్ర‌జా సంగ్రామ యాత్ర‌..
తెలంగాణలో మరిన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయి
మూడో రోజూ కొన‌సాగుతున్న‌ ప్రజా సంగ్రామ యాత్ర ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. భువనగిరి పట్టణంలో గురువారం ఉదయం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ…కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ పార్టీ, మోడీకి అనుకూలంగా చాలా సందర్భాల్లో మాట్లాడారని ఆయన తెలిపారు.

మునుగోడులో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు.10 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే లుత‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని, టీఆర్ ఎస్ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు

ఎన్నికల వరకు తన ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని బండి స్పష్టం చేశారు. మధ్యలో ఆపే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని.. వాటినే తమ మేనిఫెస్టోలో పెడతామని పేర్కొన్నారు.

పార్టీలో అందరికీ సముచిత గౌరవం ఉంటుందన్న ఆయన.. బీజేపీలో టికెట్ల విషయంలో ఎవరికీ హామీ ఉండదని.. పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

చికోటి క్యాషినో వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నదని ఆరోపించారు. ఈ స్కామ్‌ను కూడా డ్రగ్స్ స్కామ్ లాగే నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

Related posts