ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల పరామర్శించారు. బుధవారం విద్యానగర్ లోని మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయనకు ఇటీవల ఢిల్లీలో శస్త్రచికిత్స జరగడంతో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని షర్మిల ఆకాంక్షించారు.
ఈ క్రమంలోనే పలు అంశాలు వారిద్దరూ చర్చించారు. దళితుల పక్షాన చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలవాలని మందకృష్ణ.. షర్మిలను కోరారు. అలాగే సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించబోయే “దళిత భేరి” బహిరంగ సభకు మందకృష్ణను ఆహ్వానించారు.
MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఈరోజు తన నివాసంలో కలసి పరామర్శించడం జరిగింది.ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను.అలాగే Sept.12న YSR తెలంగాణ పార్టీ తిరుమలగిరిలో నిర్వహించే "దళిత భేరి" బహిరంగ సభకు ఆహ్వానించాను. pic.twitter.com/UpK74kX4bJ
— YS Sharmila (@realyssharmila) September 8, 2021