సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలాన్ని త్వరలోనే ఏపీలో విలీనం చేయనున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఇటీవల రాజ్భవన్లో గవర్నర్తో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భేటీల నేపథ్యంలో ఈ విషయం చర్చకు రాగా, కేసీఆర్ అందుకు అంగీకరించినట్టు సమాచారం.
2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు ఏపీలో విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పుడు భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసే విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.