ఏడోవారం బిగ్ బాస్ హౌజ్కి బాబా భాస్కర్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఏ మాత్రం శ్రమించకుండా తనకి ఈ పదవి దక్కడంపై బాబా సంతృప్తిగా లేడు. శ్రీముఖి కూడా శిల్పా చక్రవర్తి వలనే ఈ పదవి దక్కిందని అనడంతో ఆయన నిరుత్సాహంగా కనిపిస్తూ శ్రీముఖితో మాట్లాడడం మానేశాడు. దీంతో శ్రీముఖి బాబా భాస్కర్ దగ్గరకి వెళ్ళి సారీ సారీ అంటూ ఆయనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. చివరికి బాబా .. శ్రీముఖిని క్షమించేశాడు.
కొద్ది సేపటి తర్వాత ఇంటి సభ్యులతో లివింగ్ రూంలో డిస్కషన్ పెట్టిన బాబా భాస్కర్ తనకి కెప్టెన్సీ టాస్క్ శిల్పా వలననే వచ్చిందని అందుకు ఆమెకి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ వారం తాను కెప్టెన్గా ఉండాలంటే ఇంటి సభ్యులు నేను చెప్పిన నియమాలు పాటించాలని అన్నాడు. కెప్టెన్ అని ఎవరు పిలవొద్దని, నేను ప్రతి పని చేస్తానని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నాడు. తాను కెప్టెన్గా ఉన్న రోజులలో షార్ట్స్ వేసుకోవద్దని కండీషన్స్ పెట్టిన బాబా .. మీరు మీకు నచ్చినట్టు సరదాగా ఉండండని వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు.
ఇంటికి సంబంధించిన బాధ్యతలలో భాగంగా వితికా, వరుణ్, పునర్నవి బాత్రూం క్లీన్ చేయాలని.. కిచెన్ను హిమజ, శివజ్యోతి, శిల్పా హ్యాండిల్ చేయాలని కెప్టెన్ ఆదేశించారు. రాహుల్, అలీలకు లివింగ్ రూం క్లీన్ చేసే బాధ్యతను బాబా భాస్కర్ అప్పగించారు. శ్రీముఖి తన పర్సనల్ అసిస్టెంట్గా ఉంటుందని చెప్పిన బాబా.. ఆమె స్విమ్మింగ్ పూల్, కోర్ట్ యార్డ్, డైనింగ్ ఏరియాను క్లీన్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తానికి బాబా కెప్టెన్సీలో ఇంటి సభ్యులు సరదాగా కనిపించారు.
కొద్ది సేపటి తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకి సరదా టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు ఆరు జోడీలుగా విడిపోవాలి. ప్రతి జోడీలోని ఇద్దరు సభ్యులు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి ఎదుటివారిని నవ్వించాలి. ఇందుకు సంబంధించిన ప్రశ్నలను బిగ్ బాసే ఇచ్చారు. ఈ ప్రక్రియకు శ్రీముఖి సంచాలకులుగా వ్యహరించింది. ప్రతి ప్రశ్నకు కేవలం 5 సెకెన్లలో ఫన్నీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.
టాస్క్లో భాగంగా శివజ్యోతి-రవి, హిమజ-మహేష్, శిల్పా-అలీ, రాహుల్-వితికా, వరుణ్-పునర్నవి, శ్రీముఖి-బాబా భాస్కర్ జంటలుగా టాస్క్లో పాల్గొనగా, మహేష్ మాత్రమే ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి అందరిని నవ్వించాడు. దీంతో ఇంటి సభ్యులు అతనని విజేతగా పేర్కొన్నారు. ఇక నుండి అతని ముందు ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ మాట్లాడాలని బిగ్ బాస్ చెప్పారు.
47 రోజుల పాటు సొంత కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్న హౌజ్మేట్స్కి బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు పంపిన కమ్మని వంటకాలతో పాటు వారు రాసిన లెటర్స్ని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఆ లెటర్స్ ఒక్కొక్కరు చదువుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పంపిన ఫుడ్ని అందరు తిని ఎంజాయ్ చేశారు. అనంతరం మహేష్ అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది అని బాబా భాస్కర్ ఇంటి సభ్యులతో కూర్చొని చర్చించారు. ముందు ఒకలా, వెనుక ఒకలా ఉంటున్నాడని చెప్పుకొచ్చాడు. నమ్మినోడిని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాడని బాబా స్పష్టం చేశారు.ఇక ఈ రోజు ఎలిమినేషన్లో ఉన్న ఇద్దరు సేవ్ కానుండగా, ఇంటి నుండి ఎవరకు బయటకి వెళతారో అనే విషయంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.
నగ్నంగా ఎలా నటిస్తుంది… అమలాపాల్ కు, దర్శకుడికి బుద్ధి ఉందా ? : తమ్మారెడ్డి భరద్వాజ