రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. జులై 19న ‘ఆమె’ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర పోస్టర్ చూడగానే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే సినిమా అనిపించింది. అందుకే ఈ చిత్ర తెలుగు హక్కులు కొన్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. కానీ సినిమా చూసిన తర్వాత తాను ఆశ్చర్యపోయానని, అమలాపాల్, దర్శకుడు రత్న కుమార్ బుద్ధి ఉండే ఈ సినిమాని తీశారా అనిపించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఇంకా పిచ్చోడు. వీరందరికన్నా సినిమాని కొనుకున్న తాను పిచ్చోడిని అని తమ్మారెడ్డి సరదాగా కామెంట్స్ చేశారు. ఇలాంటి కథలో నటించాలన్నా, తీయాలన్నా సినిమాపై ఇష్టం ఉండాలని, అలాగే ధైర్యం కావాలని తమ్మరెడ్డి అన్నారు. కథని నమ్మి న్యూడ్ సీన్స్ లో నటించిన అమలాపాల్ ని తప్పకుండా అభినందించాల్సిందే అని తమ్మారెడ్డి తెలిపారు. ఈ చిత్రంలో అమలాపాల్ నటన చూసిన తర్వాత ఈ జనరేషన్ లో ఇంత అద్భుతంగా నటించే నటిని చూడలేదని తమ్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.
previous post
వర్మ “పవర్ స్టార్” తీస్తే తప్పేంటి ?… ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్