బుల్లితెర కామెడీ షో “జబర్దస్త్” ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కొంతమంది ఈ షోపై విమర్శలు గుప్పించినా… చాలామంది ఈ షోను చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. షో ఇంతగా పాపులర్ అవ్వడానికి ఒక కారణం యాంకర్స్ అని చెప్పొచ్చు. అనసూయ, రష్మీ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు ఈ షోతో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇటు బుల్లితెరపై అలరిస్తూనే, మరోవైపు వెండితెరపై కూడా మెరుస్తున్నారు. అనసూయకు “రంగస్థలం” సినిమాలోని రంగమ్మత్త పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అనసూయకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం “కథనం” అనే చిత్రం చేస్తున్న అనసూయ పలు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో ఇటు “జబర్దస్త్”కు అటు సినిమాలకు కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట. అందుకే అనసూయ “జబర్దస్త్”కు దూరం కానుందనే వార్తలు బలంగా విన్పిస్తున్నాయి. మరి ఈ వార్తలపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.
next post
అమీర్ ఖాన్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు..-చిరంజీవి ప్రసంశలు వర్షం