telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును అక్షర్ పటేల్ దెబ్బ తీసాడు. అక్షర్ వేసిన రెండు ఓవర్లలోనే ఓపెనర్లను ఇద్దర్ని పెవిలియన్ కు చేర్చాడు. డొమినిక్ సిబ్లీ(2) ను ఔట్ చేసిన అక్షర్ ఆ తర్వాతి ఓవర్లోనే జాక్ క్రాలే(9) ఔట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో మొదటి 5 ఓవర్లు బౌలింగ్ చేసిన పేసర్లు ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ అక్షర్ మాత్రం రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసాడు. అంటే ఈ పిచ్ పై గత మ్యాచ్ లో బాల్ బాగా టర్న్ కావడంతో ఇప్పుడు పిచ్ ను పేస్ కు అనుకూలంగా మారుస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది అవాస్తవం అని తేలిపోయింది. మేతేరా పిచ్ మొదటి రోజు నుండే స్పిన్ ను బాగా అనుకూలిస్తుంది.అయితే భారత్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కు వెళ్లాలంటే ఈ నాలుగో టెస్టులో విజయం అయిన సాధించాలి లేదా డ్రా అయిన చేసుకోవాలి. కానీ ఓడిపోకూడదు. ఒకవేళ ఓడిపోతే ఫైనల్ కు ఆసీస్ వెళ్తుంది.

Related posts