telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్…

పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిపింది. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు స్కూల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్ల శ్రీనివాస్. ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ గురించి లక్ష రూపాయలు డిమాండ్ చేసి 40 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు స్కూల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీనివాస్. ఈ ఘటన పై ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఒక ప్రైవేటు స్కూల్ 7వ తరగతి వరకు అనుమతి ఉంది. 8,9,10 తరగతుల అనుమతి కోసం స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ను సంప్రదించాడు. పర్మిషన్ ఇవ్వాలి అంటే 40 వేల రూపాయలు లంచం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు. అనుమతి కి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి డబ్బులు ఆఫీసుకు తెచ్చి ఈ రోజు ఇవ్వమని శ్రీనివాస్ చెప్పారు.. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ 40 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాము. శ్రీనివాస్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నాం.. ఎవరైనా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని కి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి తెలిపారు.

Related posts