ఏలూరు జిల్లా చాట్రాయి మండలం లో దారుణం జరిగింది. ఉప్పెన సినిమాలో తన కూతురుని ప్రేమించిన హీరో మర్మాంగాన్ని తొలగిస్తాడు హీరోయిన్ తండ్రి. సేమ్ టు సేమ్ ఈ సినిమా తరహాలో వాస్తవ ఘటన కలకలం రేపింది..
వివరాల్లోకి వెళితే…
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తన కుమార్తె వెంట పడుతున్నాడంటూ కక్ష పెంచుకున్న అదే గ్రామానికి చెందిన జాన్ అనే వ్యక్తి.. దాడికి పాల్పడ్డాడు. చీకటి గదిలో బంధించి, చిత్రహింసలు పెట్టి రోకలిబండతో యువకుని మర్మాంగంసౌ దాడి చేసాడు. దీంతో యువకుడి మర్మాంగాలు చిధ్రమై తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్దితిలోకి వెళ్ళటంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఆస్పత్రికి అక్కడ నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.అయితే ప్రస్తుతానికి యువకుడి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.