సూపర్స్టార్ మహేశ్ మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అశోక్ డెబ్యూ మూవీ అక్టోబర్లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ,రాఘవేంద్రరావు, మంజుల, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. చిత్రానికి తొలి క్లాప్ కృష్ణ కొట్టారు. శశి దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉన్న ఈ చిత్రం పలుకారణాల వలన ఆగింది. ఈ చిత్రానికి “అదే నువ్వు అదే నేను” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా అశోక్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది అశోక్ డెబ్యూ చిత్రం నవంబర్ 10న గ్రాండ్గా లాంచ్ కానుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంకి గిబ్రాన్ సంగీతం అందించనున్నారు. పద్మావతి గల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథానాయికగా ఎవరిని ఎంపిక చేసారనే విషయం తెలియాల్సి ఉంది. అశోక్ కొన్నాళ్ళుగా అమెరికాలోని ఓ ఇన్స్టిట్యూట్లో నటనకి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ తెలుగు ప్రేక్షకులని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ వెండితెరపై మరో సూపర్ స్టార్గా ఎదిగారు మహేష్ బాబు. ఆయన తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేష్ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు, మంజుల, ఆమె కూతురు జాన్వీ కూడా వెండితెరపై మెరిసిన విషయం విదితమే.
Announcement:
A fresh talent is making way to TFI@AshokGalla_ To Debut
Grand launch on November 10th@SriramAdittya 🎬 to direct@Ghibranofficial 🎶 @RIP_apart 🎥#PadmavathiGalla to produce pic.twitter.com/AJOsQiR7jc— BARaju (@baraju_SuperHit) November 7, 2019