అశోక్ గజపతి రాజు మహిళ పై దురుసుగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో రావడం దారుణమని, అశోక్ గజపతి రాజు సౌమ్యుడు అని చిన్న విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు విజయనగరం టిడిపి కార్యదర్శి ఐవిపి రాజు పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ప్రచారంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఓ మహిళా కార్యకర్త పై చేయి చేసుకున్నారని వచ్చిన ఆరోపణ పై జిల్లా టిడిపి స్పందించింది. బాధితులుగా ప్రచారం లో ఉన్న మహిళ హేమలతతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రచారం సమయంలో హారతి ఇస్తున్నామని, మంట అధికంగా రావడం తో అశోక్ గజపతి రాజు వెనక్కి వచ్చి హారతి పళ్ళెంను క్రిందకి కొట్టారని తనపై దాడి చేయలేదని ప్రకటించారు హేమలత. నిజానికి తమ అభిమాన నాయకుడు వచ్చారని ఓ మహిళ పూలు జల్లు తుండగా.. అశోక్ గజపతిరాజు సహనం కోల్పోయారని నేరుగా ఆ మహిళా కార్యకర్తకు వెళ్లి ఆమె మెడలు వంచి మరీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది అంత అబ్బదము అని తెలిపారు.
previous post