telugu navyamedia
క్రీడలు వార్తలు

ముంబై జట్టులోకి అర్జున్ టెండుల్కర్….

సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ ముంబై సీనియర్ జట్టులోకి తొలిసారిగా ఎంపికయ్యాడు. అయితే ఈ జనవరి 10 నుండి ప్రారంభం కానున్న సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నీ కోసం 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది ముంబై క్రికెట్ అసోసియేషన్. అయితే సూర్యకుమార్ యాదవ్ న్యాయకత్వం వహించనున్న ఈజట్టులో లెఫ్ట్ ఆర్మ్ క్విక్ మరియు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మాన్ అయిన అర్జున్ చోటు సంపాదించుకున్నాడు. ఇక అర్జున్ తప్పకుండ తుది జట్టులో ఉంటాడు అని ముంబై జట్టు చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా తెలిపాడు. అయితే మొదట ముంబై ఈటోర్నీకి 20 ఆటగాళ్లతోనే జట్టును ప్రకటించగా ఇప్పుడు అర్జున్ తో పాటుగా మరో మీడియం పేసర్ క్రుటిక్ హనగవాడిని జట్టులో చేర్చింది. అర్జున్ టెండూల్కర్ ఇంతకుముందు ముంబై అండర్ -19 అలాగే ఇండియా అండర్ -19 కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

ముంబై జట్టు: సూర్యకుమార్ యాదవ్ (c), ఆదిత్య తారే (vc), యశస్వి జైస్వాల్, ఆకర్షిత్ గోమెల్, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేష్ లాడ్, శివం దుబే, శుభం రంజనే, సుజిత్ నాయక్, సైరాజ్ పాటిల్, తుషార్ దేశ్‌పందేజ్, ప్రతామేష్ డాక్, అధర్వ అంకోలేకర్, శశాంక్ అటార్డే, షమ్స్ ములాని, హార్దిక్ తమోర్, ఆకాష్ పార్కర్, సుఫియాన్ షేక్, కృతిక్ హనగావాడి, అర్జున్ టెండూల్కర్

Related posts