telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సింగరేణి సీఎండీకి నోటీసులు ఇస్తా: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

sridar babu mla

సింగరేణి సమావేశానికి నన్ను ఎందుకు పిలవలేదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందనిఆరోపించారు. సింగరేణి కి సంబంధించిన సమావేశాన్ని రిసార్ట్ లో నిర్వహించాల్సిన అవసరమేంటి? ఈ సమావేశానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నన్ను ఎందుకు పిలవలేదు? అని ప్రశ్నించారు. సమావేశానికి తనను పిలకపోవడంపై సింగరేణి అధికారులకు, సీఎండీకి నోటీసులు ఇస్తానని అన్నారు.

కొప్పుల ఈశ్వర్ తమ హక్కులను కాలరాస్తున్నారని, ఈ విషయమై స్పీకర్ కు సభా హక్కుల నోటీసులు ఇస్తానని చెప్పారు. ప్రభుత్వానికి తనపై వ్యక్తిగతంగా కోపం ఉంటే ఉండొచ్చు కానీ, ఇలా సమావేశానికి పిలవకుండా చేయడం తగదని అన్నారు. దీనికి గల కారణం ఏంటో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts