సింగరేణి సమావేశానికి నన్ను ఎందుకు పిలవలేదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందనిఆరోపించారు. సింగరేణి కి సంబంధించిన సమావేశాన్ని రిసార్ట్ లో నిర్వహించాల్సిన అవసరమేంటి? ఈ సమావేశానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నన్ను ఎందుకు పిలవలేదు? అని ప్రశ్నించారు. సమావేశానికి తనను పిలకపోవడంపై సింగరేణి అధికారులకు, సీఎండీకి నోటీసులు ఇస్తానని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ తమ హక్కులను కాలరాస్తున్నారని, ఈ విషయమై స్పీకర్ కు సభా హక్కుల నోటీసులు ఇస్తానని చెప్పారు. ప్రభుత్వానికి తనపై వ్యక్తిగతంగా కోపం ఉంటే ఉండొచ్చు కానీ, ఇలా సమావేశానికి పిలవకుండా చేయడం తగదని అన్నారు. దీనికి గల కారణం ఏంటో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.