telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్ గా మారింది: కేటీఆర్

ktr trs president

సరికొత్త టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్ గా మారిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జేఎల్ఎల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గూగుల్, అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో బ్రాంచీలు ఏర్పాటు చేశాయని అన్నారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ కంపెనీల విస్తరణకు “లుక్ ఈస్ట్” పాలసీ తెచ్చామని అన్నారు.

కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందన్నారు. ఐటీ ఎగుమతుల్లో ఈ ఏడాది బెంగళూరును అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రూ.52 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు ఐదేళ్లలో లక్షా 9 వేల కోట్లకు పెరిగాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో జేఎల్ఎల్ పాత్ర గొప్పదని ప్రశంసించారు. 

Related posts