telugu navyamedia
క్రీడలు వార్తలు

వచ్చి రాగానే స్లెడ్జింజ్‌ ప్రారంభించిన శ్రీశాంత్…’

ఒక్కపుడు భారత జట్టులో అగ్రెసివ్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ 8 ఏళ్ల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగారు. ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీకి సంబంధించి కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌ చోటు దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో తన ప్రాక్టీస్‌ను ఆరంభించిన శ్రీశాంత్‌ 8 ఏళ్ల తర్వాత అదే కోపాన్ని చూపించడం ఆసక్తికరంగా మారింది. ఆది నుంచి టీమిండియాలో అగ్రెసివ్‌ క్రికెటర్‌గా పేరు పొందిన శ్రీశాంత్‌కు బాధ వేసినా.. సంతోషం కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎదుటివారిని బోల్తా కొట్టించేందుకు తనదైన శైలిలో కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు. శ్రీశాంత్‌ కెరీర్‌లో ఇలాంటివి చాలానే చూశాం. తాజాగా శ్రీశాంత్‌ సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీ సన్నాహకంగా వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్‌ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ భారీ షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ను కోపంతో చూస్తూ శ్రీశాంత్‌ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్‌పై నిలబడి బ్యాట్స్‌మన్‌పై స్లెడ్జింజ్‌కు దిగాడు.  కాగా శ్రీశాంత్‌ బౌలింగ్‌ వీడియోనూ కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ షేర్‌ చేసింది. చూడాలి మరి శ్రీశాంత్ ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడు అనేది.

Related posts