telugu navyamedia
క్రీడలు వార్తలు

వైరల్ అవుతున్న రోహిత్ ఇన్‌స్టా పోస్ట్…

రోహిత్ శర్మకు ఓ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. తన కూతురు సమైరాకు సంబంధించిన ఆ ఫొటోను చూసి హిట్‌మ్యాన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు కూడా సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఓ ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దానికి ‘ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. 2015లో రితికా సజ్దెదీని రోహిత్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2018లో సమైరా జన్మించింది. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దాంతరంగా వాయిదాపడటంతో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్‌కు చోటు దక్కింది. ఈ సుదీర్ఘ పర్యటన కోసం బీసీసీఐ ముంబైలో బయో బబుల్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ టూర్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా ముంబైలోని బబుల్‌లోకి ప్రవేశించి క్వారంటైన్ పాటిస్తున్నారు. అయితే ముంబైలో నివసించే ఆటగాళ్లకు ఆలస్యంగా చేరే వెసులబాటు కల్పించారు. దాంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో సహా రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆలస్యంగా బబుల్‌లోకి రానున్నారు.

Related posts