telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కన్నతల్లే ముగ్గురు పిల్లల్ని చంపి… నిద్రపోతున్నారని… చివరకు ?

Mother

అమెరికా, ఫోనిక్స్‌లో నివాసముండే రాచెల్ హెన్రీ (22) అనే మహిళకు ముగ్గురు పిల్లలు. మూడేళ్ల అబ్బాయి, రెండేళ్ల అమ్మాయితో పాటు ఏడు నెలల మరో పాప ఉన్నారు. ఇటీవల మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అయిన హెన్రీ… గత కొంతకాలంగా వింతగా ప్రవర్తిస్తోందని ఆమెతో పాటు అదే ఇంట్లో ఉంటున్న సమీప బంధువులు తెలిపారు. పోలీసుల విచారణలో తన పిల్లలను తానే హతమార్చినట్లు చెప్పింది. మొదట రెండేళ్ల అమ్మాయిని ముఖంపై దిండును అదిమిపట్టి చంపేసినట్లు తెలిపింది. అది చూసిన మూడేళ్ల బాలుడిని, బయట ఎవరికైన చెబితే సమస్య అవుతుందని అతడ్ని కూడా ఊపిరాడకుండా చేసి హతమార్చింది. ఆ తరువాత నిద్రపోతున్న ఏడు నెలల చిన్నారిని కూడా ముక్కు, నోటిని మూసి ఊపిరాడకుండా చంపేసింది. ఇలా ముగ్గురిని కడతేర్చిన తర్వాత తీసుకెళ్లి సోఫాపై పడుకోబెట్టింది. ఇంటికి తిరిగి వచ్చిన బంధువులకు పిల్లలు నిద్రపోతున్నట్లు చెప్పింది. చాలా సమయం గడిచిన పిల్లలు నిద్ర లేవకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు దగ్గరికి వెళ్లి చూశారు. ముగ్గురు పిల్లలలో ఎలాంటి చలనం లేకపోవడంతో వెంటనే ఫోనిక్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు హెన్రీని అరెస్ట్ చేసి ఆమెపై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 31న ఆమెను న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. ఈ అమానుష ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫోనిక్స్‌లో చోటుచేసుకుంది.

Related posts