telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనాతో మేజిస్ట్రేట్ కన్నుమూత

corona vairus

కరోనా వైరస్ అన్ని రంగాలవారిని టచ్ చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీనపడి ఎందరో పోలీసులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కరుణాకర్ పైక (55) కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన బరంపురంలోని ఎంకేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

పర్లాకిమిడి కొవిడ్ ఆసుపత్రి ఇన్‌చార్జ్ అయిన కరుణాకర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారి. కరుణాకర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బరంపురం ఆసుపత్రికి తరలించినా కాపాడలేకపోయామని గజపతి కలెక్టర్ అనుపమ్ సాహా ఆవేదన వ్యక్తం చేశారు. కరుణాకర్‌కు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Related posts