లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కారణంగా చేపల వేటపై నిషేదం విధించారు.
దీంతో మూడు నెలల పాటు మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారు. జాలరులకు సాయాన్ని అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. పడవలపై పని చేస్తున్న జాలరుల వివరాలను సేకరిస్తున్నారు. వీరికి 20 రోజుల్లో ఆర్థిక సాయం అందించనున్నారు.
మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..