telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కేంద్ర ఆర్ధిక మంత్రి తో ఏపి ఆర్ధిక మంత్రి భేటీ…

40 నిముషాల పాటు జరిగిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ భేటీ ముగిసింది. అనంతరం బుగ్గన మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన అన్ని విషయాలు నిర్మలా సీతారామన్ కు వివరించాను అని తెలిపారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం పై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం అంచనాలకు కేంద్రం ఒప్పుకుంటుందని ఆశిస్తున్నాం అన్నారు. ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన 4 వేల కోట్ల రూపాయలలో, గత వారం ఏలాంటి షరతులు లేకుండానే 2,300 కోట్ల రూపాయలకు ఇటీవల కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 2013-14 అంచనాలకు టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నాటి అంచనాల కంటే భూసేకరణకే 17 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. 2013-14 ఆర్ధిక సంవత్సరం అంచనాల ప్రకారం అయితే ఇబ్బంది అవుతుందని కేంద్ర మంత్రికి చెప్పాం. సవరించిన అంచనా కమిటీ నివేదికలను కేంద్రానికి ఇచ్చాం. వాటిని సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తం రూ. 12 వేల కోట్లు ఖర్చు పెడితే రూ. 8 వేల కోట్లు ఇచ్చారు. ఇంకా 4 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అందులో కూడా రూ. 2,300 కోట్లకు మంజురు లభించింది. 2014లో ప్రాజెక్టు పునరావాసంలో ఖర్చు పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రివర్గమే తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కుడా చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబు 2013-14 అంచనాలకే ఒప్పందం చేసుకోవడం అతిపెద్ద తప్పు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేస్తోంది. నిర్మాణం పురోగతిలోనే ఉంది అన్ని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు.

Related posts