telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

రేపే జనసేన ఆవిర్భావ సభ .. ఘనంగా ఏర్పాట్లు.. !

పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్తరాంధ్ర లేదంటే గోదావరి జిల్లాల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని మొదటి నుండి చెప్తున్నారు. కానీ, ఇప్పటికి కొన్ని నియోజకవర్గాలు పరిశీలనలోనే ఉండటం విశేషం. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గాలను పవన్ పరిశీలిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవన్నీ కూడా కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే స్థానాలు కావడం ప్రధానంగా ఎంచుకోబడ్డాయి.

రేపు రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సభ ద్వారా జనసేనాని ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాజమహేంద్రి సభలోనే జనసేన మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నారు పవన్ కళ్యాణ్‌. ఆవిర్భావ సభకు వచ్చే ప్రతి నాయకుడు, కార్యకర్త సంతోషంగా తిరిగి వెళ్లేలా అక్కడి నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts