telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్‌కు అమెరికా సాయం.. ఏకంగా 500 మిలియన్‌ డాలర్లు

Biden USA

ఈ కరోనా కష్ట కాలంలో చాలా దేశాలు భార‌త్‌కు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నాయి. కొంద‌రు ఆక్సిజ‌న్, మ‌రికొంద‌రు మందులు, ఇంకా కొంద‌రు ఇత‌ర సామాగ్రి ఇలా.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. మ‌రికొన్ని దేశాలు భార‌త్ సాయాన్ని అందుకుని.. ఇప్పుడు రుణాన్ని తీర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. ఇందులో భాగంగానే అమెరికా కూడా ఇండియాకు ఆర్థిక సాయం అందిస్తోంది. కరోనా పోరులో ఇప్పటి వరకు ఇండియాకు 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణి చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది అమెరికా. ఇండియాకు 500 మిలియన్ డాలర్ల కోవిడ్ సాయాన్ని అమెరికా ప్రభుత్వం అందించింది. ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేసింది వైట్ హౌస్. అలాగే కరోనా మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న ఇతర దక్షిణాసియా దేశాలకు కూడా సహాయాన్ని అందించడానికి బైడెన్ యంత్రాంగం ఇప్పుడు కృషి చేస్తోందని జెన్ సాకి వైట్ పేర్కొన్నారు.

Related posts