telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా పెను సవాలుగా మారింది : మోడీ సంచలన వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సమావేశం “కోవిడ్ -19” తో చేసిన యుద్ధంలో మోడి నాయకత్వానికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా జిల్లాల్లో “కోవిడ్” పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివరించిన అధికారులు… “రియల్ టైమ్” పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న తీరును, అనుభవాన్ని ప్రధానితో పంచుకున్నారు. తమ జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెంచడానికి తీసుకున్న చర్యల గురించి కూడా ప్రధానికి తెలియజేశారు అధికారులు. మహమ్మారిపై పోరాడటానికి ప్రతి ఒక్కరూ పూర్తి నిబద్ధతతో ఉండేలా చూడాలని కోరిన ప్రధాని…“కరోనా” పెను సవాలుగా మారిందన్నారు. కొత్త సవాళ్ళ మధ్య, కొత్త వ్యూహాలు, పరిష్కారాలు అవసరమన్న ప్రధాని…ఇటీవల దేశంలో యాక్టివ్ కేసులు తగ్గడం ప్రారంభమైందన్నారు. ఇన్ఫెక్షన్ స్వల్ప స్థాయిలో ఉన్నప్పటికీ , “కరోనా” వైరస్ ఉన్నంతవరకు ఈ సవాలు ను ఎదుర్కోవాలని హెచ్చరించిన ప్రధాని. మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర, జిల్లా అధికారుల కృషిని ప్రశంసించారు. “కరోనా”ను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక, సమర్థవంతమైన విధానాలను రూపొందించడంలో అధికారుల అనుభవాలు, అభిప్రాయాలు బాగా సహాయపడ్డాయన్న ప్రధాని… అన్ని స్థాయిలలో రాష్ట్రాలు, వివిధ వర్గాల సలహాలను కూడా పరిగణన లోకి తీసుకుని టీకా వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.

Related posts