telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో నేడు విద్యాసంస్థల బంద్

half day schools in AP since high temp

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు విద్యాసంస్థల బంద్ కు ఏపీ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పెండింగ్ లో ఉన్న రూ. 1,112 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

బంద్ కు పీడీఎస్యూ, పీడీఎస్వో, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, తదితర విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. విద్యార్థి సంఘాల బంద్ కు టీఎన్ఎస్ఎఫ్ కూడా తన సంఘీభావాన్ని ప్రకటించింది. 

Related posts