ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి భారీ విరాళం ప్రకటించారు. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున మరో 150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. తాజా విరాళంతో గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది. డబ్ల్యూహెచ్ఓ బలంగా ఉంటేనే ప్రపంచానికి మంచిదని బిల్ గేట్స్ చ్చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకు నిధులను నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను కూడా ఆయన తప్పుపట్టారు.
ఈ సందర్భంగా బిల్ గేట్స్ భార్య మిలిందా గేట్స్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎదుర్కోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థకు అమెరికా ఆర్థిక సాయాన్ని ఉపసంహరించుకోవడం ప్రమాదకరమని చెప్పారు. సంక్షోభ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ చేతులు కలపాలని అన్నారు.
40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్