telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కరోనా అప్డేట్‌

ఆంధ్రప్రదేశ్‌లో నేడు కరోనా కేసులు భారీ తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23, 022 శాంపిల్స్‌ పరీక్షించగా.. 310 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 994 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,87,67, 963 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,57, 562 కు పెరిగింది.. ఇక, 20,36, 048 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,256 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 7, 258 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Related posts