ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును విచారించేందుకు సీబీఐ త్వరలో రంగంలోకి దిగబోతోంది. సీబీఐకి కేసు బదిలీ అయిన తర్వాత విశాఖ నుంచి సీబీఐ అధికారులు అంతర్వేది వెళ్లనున్నారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ప్రాథమిక నివేదికను ఈ నెల 17న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. దీనిని సమీక్షించిన అనంతరం కేంద్రం నుంచి సీబీఐకి సంకేతాలు అందనున్నట్టు తెలుస్తోంది.
రథం దగ్ధం తర్వాత అంతర్వేదిలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఆలయంతోపాటు అంతర్వేదిలోని కీలక మార్గాల్లో 200 మంది పోలీసులతో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.
రాహుల్, లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: మంత్రి ఎర్రబెల్లి