telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విశాఖ లో ఘనంగా జరిగాయి. సీఎం జన్మదినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు తోపాటు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కె .కె రాజు అద్వర్యంలో నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకలలో మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కట్ చేసారు.

జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అందంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రము లో కుల ,మాత, ప్రాంత ,పార్టీలకు అతితగా సంక్షేమ పధకాలు ప్రజలకు జగన్ అందిస్తున్నారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయారారోగ్యాలతో సంతోసంగా ఉండాలని అవంతి శ్రీనివాస్ ఆకాంక్షించారు.

Related posts