telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘దిశ’ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఉపరాష్ట్రపతి వెంకయ్య హర్షం

Venkaiah-Naidu

‘దిశ’ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసినందుకు . ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను’ అని వెంకయ్య ట్విట్టర్ లో పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నేపథ్యంలో మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆమె పేరిటే చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ నిన్న ఆమోదించింది. అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి ఈ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారు.

Related posts