ప్రముఖ టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. యాంకర్ అనుమానాస్పద మృతితో ఆమె ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను కూాడా పరిశీలించారు. పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుంచి శాంతి తన గదిలోంచి బయటికి రాకపోవడం లేదని స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. దీంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు , పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి చూడగా ఇంట్లో అనుమానాస్పదంగా ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.