అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఒకవైపు షోలతో మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది అనసూయ. ప్రేమ విషయంలో అయితే అనసూయ చాలా కష్టాలు పడింది. ఈమె ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నపుడు ఓ సారి NCC క్యాంప్కి వెళ్లింది. ఆ క్యాంప్కి అనసూయే గ్రూప్ కమాండర్ కావడంతో.. రూల్స్ బ్రేక్ చేస్తే వారికి పనిష్మెంట్స్ వేసేది ఈ అందాల బొమ్మ. ఇక అదే క్యాంప్కి వచ్చిన మరో స్టూడెంట్ భరద్వాజ్. అనసూయని చూడగానే వెంటనే మనసు పారేసుకున్నాడట అతడు. అనూ దగ్గరికి వెళ్లి డైరెక్ట గా మ్యారేజ్ ప్రపోజల్ చేశాడట. అయితే ఏం ఆన్సర్ ఇవ్వకుండానే క్యాంప్ నుంచి వచ్చేసిందట. మళ్లీ సరిగ్గా ఏడాదిన్నర తర్వాత క్యాంప్కి వెళ్లే సమయానికి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట. అలా తమ స్నేహం మొదలైందని చెప్పింది అనసూయ.
ఆ తర్వాత భరద్వాజ్ పై ఇష్టం, ప్రేమ మొదలయిన నేపథ్యంలో విషయాన్ని తన తల్లికి చెప్పిందట అనసూయ. కానీ అనసూయకి ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. పెద్ద కూతురుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే… మిగిలిన వాళ్లకు కూడా మంచి సంబంధాలు వస్తాయని భావించేవారట అనసూయ తండ్రి. కానీ కొన్నాళ్ల తర్వాత అనసూయకు మరో సంబంధం తీసుకొచ్చాడు వాళ్ల నాన్న. తట్టుకోలేక అనసూయ ప్రేమ విషయం చెప్పేయడంతో.. తన నాన్నతో చాలా గొడవలు జరిగిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది అనసూయ. ఆ తర్వాత భరద్వాజ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసి కొన్నాళ్లు హాస్టల్లో ఉంది. కొద్ది రోజుల తర్వాత ఇంట్లోకి రానిచ్చినా కూడా భరద్వాజ్తో మ్యారేజ్ కి మాత్రం ససేమేరా అన్నారట అనసూయ నాన్న. అనసూయ భరద్వాజ్ నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టడంతో చేసేది లేక పెళ్లికి ఒప్పుకున్నారు. అలా భరద్వాజ్ అనసూయకి ప్రపోజ్ చేసిన 9 ఏళ్ళ తర్వాత కానీ వారి పెళ్లి జరగలేదు. చివరికి రెండు కుటుంబాల అంగీకారంతో 2010 ఫిబ్రవరి 10న అనసూయ తన ప్రేమించిన భరద్వాజ్ తో ఏడడుగులు వేసింది. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు.