telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ సినిమాలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా : అమితాబ్

Big-B

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 21వ మూవీగా విడుదల కానుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. “లెజెండ్ అమితాబ్ బచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం” అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేసిన అమితాబ్ ఈ సినిమా గురించి స్పందించారు. “ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైలురాయి లాంటి ఈ సినిమాలో భాగం కావడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌‌కు అభినందనలు. ఇలాగే మరో 50 ఏళ్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా” అంటూ కామెంట్ చేశారు. అమితాబ్‌తో కలిసి నటిస్తుండడం పట్ల ప్రభాస్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లు సమాచారం. అతి త్వరలో చిత్రాన్ని సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ భాగం అవుతుండటంతో సినిమాపై ఉన్న అంచనాలు పెరిగిపోయాయి.

Related posts