2019 లోక్ సభ ఎన్నికలలో ఘన విజయం సాధించినందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ భారత ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు. “ప్రియమైన నరేంద్రమోదీ గారు మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. మీరు అనుకున్నది సాధించారు .. దేవుడు మిమల్ని చల్లగా చూడాలి” అని ట్వీట్ చేశారు రజనీ. లోక్ సభ ఎన్నికలకి దూరంగా ఉన్న రజనీకాంత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అప్పటి వరకు సినిమాలు చేస్తూ ఉంటారు రజినీకాంత్. రజనీ “మక్కల్ మండ్రమ్” అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రజని “దర్భార్” సినిమాతో బిజీగా ఉన్నారు.
జగ్గారెడ్డి తీరుపై కాంగ్రెస్ లో అనుమానాలు!