దీపావళికి విడుదలైన రెండు సినిమాలు రజనీ కాంత్ సినిమా అన్నాత్తే.. అక్షయ్ కుమా సూర్యవంశీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధిస్తున్నాయి. రజనీకాంత్ అన్నాత్తే రూ.200 కోట్ల క్లబ్లో చేరగా, అక్షయ్ కుమార్ సూర్యవంశీ కూడా టికెట్ కౌంటర్లలో జోరుగా దూసుకుపోతోంది.
బాలీవుడ్లో సూర్యవంశీ భారీ కలెక్షన్లు..
అక్షయ్ కుమార్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యవంశీ లో అక్షయ్తో పాటు, అజయ్ దేవగన్ , రణవీర్ సింగ్ కీలక పాత్రలు ఉన్నాయి. ఈ ముగ్గురూ కలిసి ముంబయిని ఉగ్రదాడి నుంచి కాపాడుతారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బుధవారం, ఈ చిత్రం మొత్తం కలెక్షన్కు రూ.9.55 కోట్లు ఉండగా..ఇప్పడు రూ.112.36 కోట్లకు చేరుకుంది. బాలీవుడ్లో హిందీ సినిమాలు విడుదల లేకపోవడంతో మంచి స్కోర్ చేసుకొంది. శుక్ర 26.29 కోట్లు, శని 23.85 కోట్లు, ఆది 26.94 కోట్లు, సోమ 14.51 కోట్లు, మంగళ 11.22 కోట్లు, బుధ 9.55 కోట్లు. మొత్తం: ₹ 112.36 కోట్లుకు చేరుకుంది.
రజనీ కాంత్ ‘అన్నాత్తై’ కలెక్షన్ల మోత..
రజనీకాంత్ నటించిన చిత్రం అన్నాత్తే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.202.47 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పట్టికీ అవేమి కలెక్షన్న వర్షానికి ఆపలేకపోయాయి.
అన్నాత్తే బాక్స్ ఆఫీస్ విడుదలై కేవలం 7 రోజుల్లో ₹200 కోట్ల క్లబ్లోకి ప్రవేశించింది. మొదటి 1 – ₹ 70.19 cr Day 2 – ₹ 42.63 cr Day 3 – ₹ 33.71 cr Day 4 – ₹ 28.20 cr Day 5 – ₹ 11.85 cr Day 6 – ₹ 9.50 cr Day 7 – ₹ 6.39 cr మొత్తం – ₹ 202.47 cr,” ట్రేడ్ మార్క్ సంపాదించుకుంది.ఈ రెండూ దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆలస్యం అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.
నాగబాబు కౌంటర్ పై బాలయ్య స్పందన