telugu navyamedia
క్రైమ్ వార్తలు

అసోంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 10 మంది చనిపోయారు. వేకువ‌జామున‌ అతి ప్ర‌విత్ర‌మైన ఛ‌ఠ్ పూజను జరుపుకొని భ‌క్తులంతా మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా.. మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢికొట్టడంతో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

వివ‌ర్లాలోకి వెళితే..

త్రిపురతో అస్సాం సరిహద్దు సమీపంలో పాథరకండి పోలీసుస్టేషను పరిధిలోని బైతఖల్‌ వద్ద ఆటోను ఓ సిమెంట్‌ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నతొమ్మిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించ‌గా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ట్రక్కు డ్రైవర్ ప్రమాదకరమైన వేగంతో నడుపుతున్నాడని, అందుకే ఎదురుగా వస్తున్న ఆటోరిక్షాను ఢీకొనేందుకు వాహనాన్ని అదుపు చేయలేకపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ “ప్రమాదం తర్వాత ట్రక్ డ్రైవర్ సంఘటన స్థలం నుండి పరారయ్యాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related posts