బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన పై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారంటూ ఫేక్ న్యూస్ పై ఫైర్ అయ్యారు. తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరి పిల్లలు సురక్షితంగా దిల్లీ వెళ్లేందుకు అక్షయ్ ఓ విమానాన్ని ప్రత్యేకంగా బుక్ చేశారని పేర్కొంటూ ఇటీవల ఓ వెబ్సైట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై అక్షయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. “నా సోదరి, ఆమె పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేశానంటూ వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఆ వార్త మొత్తం అవాస్తవం. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నా సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. అలాగే నా సోదరికి ఒక్కరే సంతానం. ఇలాంటి అవాస్తవాలను ప్రచూరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని అక్షయ్ ట్వీట్ చేసాడు. దీంతో ఆ వెబ్ సైట్ ఆ వార్తను తొలగించింది.
previous post