telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఎయిర్‌టెల్‌ బ్యాంక్ : .. సరికొత్త సేవలు ప్రారంభం..

airtel bank new services for

సరికొత్త సేవలతో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు వినియోగదారుల ముందుకు వచ్చింది. నాణ్యమైన బ్యాంకింగ్‌ సేవలతో పాటు, నెలకు రూ.500 చెల్లింపుతో రూ.5లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను పొందేలా ‘భరోసా సేవింగ్స్‌ ఖాతా’ను వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం ఆన్‌ బ్యాంక్‌, అండర్‌ బ్యాంక్‌ కస్టమర్లకు ప్రత్యేక అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు పేర్కొంది. ఖాతాదారులు ఏవైనా ప్రభుత్వ రాయితీలు పొందే సందర్భంలో నగదు తిరిగి పొందవచ్చు అని తెలిపింది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఎండీ అనుబ్రాతా బిస్వాస్‌ మాట్లాడుతూ.. ‘భరోసా సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది.

ఈ పథకం ఆర్థికంగా వెనకబడిన వారి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృత పరిశోధనల తర్వాత దీన్ని ప్రారంభించాం. మిలియన్ల మంది వినియోగదారులను అధికారిక బ్యాంకింగ్‌ సేవలకు పరిచయం చేయడమే లక్ష్యంగా దీనిని రూపొందించాం. ఈ ఖాతా వినియోగదార్లు భారతదేశంలో ఉన్న 6,50,000 ఏపీఎస్‌ అవుట్‌లెట్లలో నగదు తనిఖీలు, ఉపసంహరణలు చేసుకోవచ్చు’ అని తెలిపారు.

Related posts