జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ తప్పకుండా సినిమా ఫీల్డ్లోకి రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తాను ఇక సినిమాలకు దూరమని తేల్చి చెప్పేశారు. అయినప్పటికీ పవర్స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ గురించి టాలీవుడ్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పవన్ సినిమా గురించి ప్రకటన వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే పవన్ ఏ సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక గత మూడురోజుల నుండి పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు మరింతగా వ్యాప్తి చెందడంతో ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూసారు. అయితే ఫైనల్ గా అనుకున్న విధంగా పవన్ గారు, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారట. కొద్దిసేపటి క్రితం ఈ న్యూస్ ఆయన సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా ఎటువంటి జానర్లో ఉంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను గతంలో పవన్ తో ఖుషి, బంగారం సినిమాలు నిర్మించిన ఏఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని, అలానే సినిమాను అఫీషియల్ గా నవంబర్ 15న పూజా కార్యక్రమంతో లాంఛ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక దీనిపై నేడో, రేపో ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.