telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా… నీ బండారం బయటపెడతా…

srireeddy

సాధినేని యామినిపై మాధవీలత చేసిన ‘మల్లెపూల’ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మల్లెపూలు కామెంట్స్ సాధినేని యామిని పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేయడంతో అప్పట్లో పెద్ద వివాదమే నడించింది. ఇటీవల పసుపు కండువా తీసేసి కాషాయ కండువా కప్పుకుని బీజేపీ అధికార ప్రతినిధి పదవి దక్కించుకున్నారు సాధినేని యామిని. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజక వర్గంలో యామిని పోటీ చేయించే ఆలోచనలో పార్టీ వర్గాల్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదే స్థానంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సినీ నటి, బీజేపీ యంగ్ లీడర్ మాధవీలత సాధినేని యామినిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. పచ్చ కండువాలు కప్పుకున్నంత కాలం బిజెపిని ప్రధానిని తిట్టి ఇపుడు అధికారంలో లేని కారణంగా దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక ఇపుడు అందరికి ఇదే దొరికిందే సందుగా కాషాయం కప్పుకున్నారు. కొత్తగా వచ్చిన పచ్చ చీరకి కాషాయం అధికార ప్రతినిధి అంటగట్టింది ఎవరు?

‘మల్లెపూలు బాగా నలిపిందనా ఆమె అధికార ప్రతినిధి? పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు. పచ్చ కండువా కప్పుకుని మల్లెపూల వాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఏం చేసారని ఇచ్చారు? పార్టీని పనికిమాలిన తిట్లు తిడితేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటే.. నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని’ అంటూ యామినిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తింది మాధవీలత. అయితే సాధినేని యామినిపై సంచలన కామెంట్స్ చేసిన మాధవీలతకు కౌంటర్ ఇస్తూ రంగంలోకి దిగింది శ్రీరెడ్డి. మాధవీలత పేరు ప్రస్తావించకుండా సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా నీ బండారం బయటపెడతా అంటూ సంచలన పోస్ట్‌లను ఫేస్ బుక్‌లో పెట్టింది శ్రీరెడ్డి. నా ఫుల్ సపోర్ట్ సాధినేని యామినికి ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా హిస్టరీ బయటకు తీయాల్సి వస్తుంది’ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శ్రీరెడ్డి. గతంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మాధవీలత శ్రీరెడ్డిపై కామెంట్స్ చేయడం వలన ఇప్పుడు ఈ విషయంలో శ్రీ రెడ్డి యామినికి సపోర్టుగా నిలుస్తోంది.

Related posts