telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెళ్ళింది పార్టీకి కాదు హాస్పిటల్ కు… అప్పుడే యాక్సిడెంట్… హీరోయిన్ వివరణ

Sharmila

కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కన్నడ నటి షర్మిలా మాండ్రే లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ తన స్నేహితుడు లోకేష్ వసంత్‌తో కలిసి శనివారం (ఏప్రిల్ 4) తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన జాగ్వర్‌ కారులో జాలీ రైడ్‌కు బయలుదేరింది. బెంగుళూరులోని వసంతనగర్‌లో కారును అతి వేగంతో నడపడంతో అదుపుతప్పి అండర్‌పాస్‌ పిల్లర్‌ను ఢీకొట్టింది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై షర్మిల స్పందించారు. పార్టీ చేసుకునేందుకు బయటకు వెళ్ళలేదని మిత్రుడితో కలసి మాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగిందని నటి షర్మిలామాండ్రే ఆదివారం వెల్లడించారు. రెండు రోజులక్రితం వసంతనగర్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద షర్మిలా ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. షర్మిలాకు స్వల్పగాయాలయ్యాయి. పార్టీ చేసుకున్నారని, మిత్రుడితో కలసి జాలీరైడ్‌కు వెళ్ళారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె వివరణ ఇచ్చారు. కడుపునొప్పి ఉండడంతో పాసులు కలిగిన తన స్నేహితులు లోకేశ్‌, డాన్‌ థామస్‌లతో కలసి సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళానని అన్నారు. డాన్‌ థామస్‌ వాహనం నడుపుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. పార్టీకి వెళ్ళాననేది అవాస్తవమన్నారు.

Related posts