‘కంచె’చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ముంబై బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘నక్షత్రం’, ‘గుంటూరోడు’ సినిమాలతో ప్రేక్షకులను అరించింది. ఇటీవల బాలయ్యతో కలిసి ఆఖండ మూవీలో నటించి భారీ విజయాన్ని అందుకుంది.
తాజాగా ఈభామ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ‘అంతిమ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలోని ఎడిటింగ్ లో తీసేసినా సల్మాన్- ప్రగ్యా నటించిన ‘మై ఛలా..’ అంటూ సాగే ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేశారు చిత్రయూనిట్ .ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.
ఈ పాటను గురు రంధవా, సల్మాన్ స్నేహితురాలు లులియా లులియా వంతూర్ పాడారు. మూడు నిమిషాల నిడివి గల ఈ పాటలో సల్మాన్, ప్రగ్యాల కెమిస్ట్రీ బాగా పండింది.
కాగా ఈ సినిమాలో సల్మాన్ తో కలిసి నటించడంపై తన అనుభవాలను పంచుకుంది ప్రగ్యా.‘ పాట షూటింగ్ జరిగిన రోజే సల్మాన్ని మొదటి సారి కలిశాను. నాకు అక్కడ విషయాలేవీ తెలియవు. సల్మాన్ లాంటి వ్యక్తిని తొలిసారి కలిసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన పక్కన నటిస్తున్నాను కదా అని చనువుగా ప్రవర్తిస్తే వారికి కోపం రావచ్చు.
అందుకే ఆయనను కలిసిన తొలి రోజే ‘మిమ్మల్ని ముట్టుకోవచ్చా’? అని అడిగాను. ఇద్దరి మధ్య కెమిస్ట్రి బాగుంటేనే పాట బాగా వస్తుంది’ అని అడిగాను. ‘దానికేముంది..నన్ను తాకొచ్చు అని సర్ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఆ తర్వాత సాంగ్ షూట్ అంతా ఎంతో కంఫర్ట్గా సాగింది. పాట కూడా బాగా వచ్చింది’ అని తన అనుభవాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రగ్యా.