సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. `సైరా నరసింహారెడ్డి` సినిమా తీసే సమయంలో సినిమాకు అవసరమైన పూర్తి సమాచారంతో పాటు షూటింగ్కి అనువైన లొకేషన్స్, నరసింహారెడ్డి జీవితం గురించి తమ నుండి పూర్తి సమాచారం తెలుసుకున్నారని, ఆ సమయంలో చిరంజీవి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారని, కానీ ఇప్పుడు న్యాయం చేయడం లేదదంటూ వారు ఆరోపించారు. ఆందోళన జరగుతుందని సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
previous post
next post