telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆందోళన

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు త‌మ‌కు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. `సైరా నరసింహారెడ్డి` సినిమా తీసే స‌మ‌యంలో సినిమాకు అవ‌స‌ర‌మైన పూర్తి స‌మాచారంతో పాటు షూటింగ్‌కి అనువైన లొకేష‌న్స్‌, న‌ర‌సింహారెడ్డి జీవితం గురించి త‌మ నుండి పూర్తి స‌మాచారం తెలుసుకున్నారని, ఆ స‌మ‌యంలో చిరంజీవి త‌మ‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారన్నారని, కానీ ఇప్పుడు న్యాయం చేయ‌డం లేదదంటూ వారు ఆరోపించారు. ఆందోళన జ‌ర‌గుతుంద‌ని సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Related posts