telugu navyamedia
సినిమా వార్తలు

తిని కూర్చొని బరువు పెరగడం లేదు : నిత్యామీనన్

NItyamenon

విభిన్నమైన సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ నటిగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న నటి నిత్యామీనన్. ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ సినిమాలకు దూరం. పాత్ర వైవిధ్యంగా ఉండి తనకు నచ్చితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఏమాత్రం మొహమాటం లేకుండా సినిమా చేయనని చెప్పేస్తుంది. అయితే ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది నిత్యా. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన “మిషన్ మంగళ్” సినిమాలో ఒక కీలకపాత్రలో నిత్య నటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. 100 కోట్ల కలెక్షన్ల దిశగా వసూళ్లు సాగిస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తన శరీరాకృతి గురించి, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందించింది. “లావుగా కనిపించే వారి గురించి చాలా మంది చులకనగా మాట్లాడుతుంటారు. బద్ధకం వల్ల, తిని కూర్చోవడం వల్ల లావైపోయారని అనుకుంటారు. అది పూర్తి నిజం కాదు. తిని కూర్చుని లావయ్యేవారు కూడా ఉంటారు. కానీ, నటుల విషయంలో అలా అనుకోవడం కరెక్ట్ కాదు. హార్మోన్ల ప్రభావం వల్ల కూడా బరువు పెరుగుతుంది. నా శరీరాకృతి గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు నన్ను చాలా బాధ పెడతాయి” అని నిత్య చెప్పింది.

Related posts